యాప్నగరం

తెలంగాణలో పెరిగిన కరోనా బాధితులు.. 1,122కు చేరిన కేసులు

telangana coronavirus: రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1122కు చేరాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 693 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకూ నమోదైన చనిపోయిన వారి సంఖ్య 29గా ఉంది.

Samayam Telugu 7 May 2020, 8:59 pm
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా గుర్తించిన కరోనా కేసులు 15 అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1122కు చేరాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 693 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకూ నమోదైన చనిపోయిన వారి సంఖ్య 29గా ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


కరోనా నుంచి కోలుకొని గత 24 గంటల్లో డిశ్చార్జి అయిన వారిలో 45 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 400 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోనే 12 కేసులను గుర్తించగా.. మరో ముగ్గురు వలస కూలీలకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక మొదటి నుంచి ఇప్పటి వరకూ వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని బులెటిన్‌లో పేర్కొన్నారు.

Also Read: undefined

మరోవైపు, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, నారాయణ్‌ పేట్ జిల్లాల్లో గత 14 రోజుల వ్యవధిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.