యాప్నగరం

నిమజ్జన వేడుకలకు 15 వేల మంది పోలీసులతో బందోబస్తు: సీపీ

Khairatabad Ganesh: నిమజ్జన వేడుకల్లో భాగంగా సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ఇప్పటికే బాలాపూర్ గణేషుడు నిమజ్జనం అయ్యాడని, మరికాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం కూడా నిమజ్జనం అవుతుందని చెప్పారు.

Samayam Telugu 1 Sep 2020, 2:54 pm
హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నిమజ్జనానికి 15 వేల మంది పోలీసులు, భద్రతా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని వెల్లడించారు. మంగళవారం అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జన వివరాలను వెల్లడించారు.
Samayam Telugu సీపీ అంజనీ కుమార్
Hyd CP Anjani Kumar


నిమజ్జన వేడుకల్లో భాగంగా సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ఇప్పటికే బాలాపూర్ గణేషుడు నిమజ్జనం అయ్యాడని, మరికాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం కూడా నిమజ్జనం అవుతుందని చెప్పారు. నిమజ్జన స్థితిని కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సీపీ తెలిపారు. నిమజ్జన కార్యక్రమం మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం ఉదయం వరకు సాగే అవకాశం ఉందని వెల్లడించారు. భక్తులు, ఉత్సవ కమిటీ నాయకులు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.