యాప్నగరం

సచివాలయం ఘన చరిత్ర: ఆరో నిజాం కాలంలో ప్రారంభం.. 10 బ్లాక్‌లు, 16 మంది సీఎంలు..

తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రక్రియ షురూ అయ్యింది. 132 ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయం ఇక కాలగర్బంలో కలిసిపోనుంది. 16 మంది సీఎంలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం విశేషం.

Samayam Telugu 7 Jul 2020, 11:52 am
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ సర్కారు సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. సెక్రటేరియట్ వైపు వెళ్లే దారులన్నీ మూసివేసి కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. నూతన సెక్రటేరియట్‌కు భూమిపూజ చేసిన ఏడాది తర్వాత పాత సచివాలయ కూల్చివేత ప్రారంభం కావడం గమనార్హం. పాత సచివాలయానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబుల పాలన కాలంలో ఇది సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది.
Samayam Telugu సచివాలయం
telangana old secretariat history


132 ఏళ్ల కాలంలో 10 బ్లాకులను నిర్మించారు. 25 ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం విస్తరించి ఉంది. 16 మంది ముఖ్యమంత్రులు ఈ సచివాలయం నుంచి పాలన చేపట్టారు. అతిపురాతన జి-బ్లాక్‌ను 1888లో ఆరో నిజాం నవాబు కాలంలో నిర్మించారు. 2003లో డి బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్స్‌ను ప్రారంభించారు.

ఎ-బ్లాక్ భవన సముదాయాన్ని 1981లో నాటి సీఎం టి. అంజయ్య ప్రారంభించారు. సి-బ్లాక్‌ను 1978లో చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. కేసీఆర్ మినహా మిగతా సీఎంలు ఈ బ్లాక్ నుంచే పని చేశారు. ఎ-బ్లాక్ రెండో దశను 1998 ఆగస్టు 10న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. డి-బ్లాక్‌కు 2003లో చంద్రబాబు శంకుస్థాపన చేయగా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అధీనంలో ఉన్న జె, ఎల్ బ్లాక్‌లను 1990లో మర్రి చెన్నారెడ్డి ప్రారంభిచారు. జే-బ్లాక్ సచివాలయంలో అతిపెద్దది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.