యాప్నగరం

ఒకే ఇంట్లో 14 మందికి కరోనా.. సూర్యాపేట టౌన్‌లో అలజడి

సూర్యాపేట పట్టణంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఒకే ఇంట్లో 14 మందికి కరోనా సోకింది. మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో మొత్తం 39 కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 17 Apr 2020, 8:28 am
సూర్యాపేటలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గురువారం (ఏప్రిల్ 16) ఒక్క రోజే 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 39కి చేరాయి. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న కేసులతో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 700లకు చేరుకుంది. ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కారణంగా కేసులు అనూహ్యంగా పెరిగాయి. సూర్యాపేట పట్టణంలోనే 30 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో పట్టణంలో ఆందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తమయ్యారు.
Samayam Telugu corona test


తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తుండగా.. ఒక్క రోజే ఇన్ని కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 52 కొత్త కేసులు నమోదు కాగా.. బుధవారం ఆ సంఖ్య 6కు పడిపోయింది. మర్కజ్ మత ప్రార్థనల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళన క్రమంగా సమసిపోతున్నట్లు కనిపిస్తుండగా.. మళ్లీ 50 కేసులు నమోదయ్యాయి.

Also Read: 19న కేసీఆర్ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.