యాప్నగరం

తెలంగాణలో కొవిడ్ తగ్గుముఖం.. కొత్త కేసులు ఎన్నంటే..

Coronavirus Telangana: తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 49,084 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1718 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 31 లక్షలు దాటింది.

Samayam Telugu 3 Oct 2020, 10:09 am
తెలంగాణలో శుక్రవారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. శుక్రవారం మొత్తం 1718 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 28,328గా ఉన్నాయి. మరో 23,224 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 2,002 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక శుక్రవారం మరో 8 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1153కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona tests


శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది.

మరోవైపు, తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 49,084 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1718 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 31 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 994 మంది ఫలితాలు తేలాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.