యాప్నగరం

కన్నవారికి కడుపుకోత.. కళ్లేదుట కన్నబిడ్డ మృత్యువాత

కుటుంబం అంతా కలిసి జలాశయం వద్దకు వెళ్లింది. ఇంతలో పిల్లలు ఫోటోలు దిగేందుకు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో కూతురు పూజిత నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడాబోయి శివాజీ కూడా నీటిలో పడ్డాడు.

Samayam Telugu 24 Aug 2020, 9:28 am
కళ్లముందు ఆడుతు పాడుతూ పెరగాల్సిన కన్నబిడ్డలు... తల్లిదండ్రుల కళ్లెదుటే చనిపోతే.. అంతకన్నా దౌర్భాగ్యం మరోకటి ఉండదు. అలాంటి విషాదకరమైన ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబంతో సరదాగా జలపాతం వద్దకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. కళ్లెదుటే కుమార్తె కన్నుమూసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కన్నవారికి తీవ్ర ఆవేదన మిగిల్చిన ఈ ఘటన జిల్లాలోని బయ్యారం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.
Samayam Telugu జలాశయంలో పడి యువతి మృతి
girl death in waterfall


పోలీసులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. బయ్యారానికి చెందిన అంబటి సతీష్‌ కుటుంబంతో కలిసి మండలంలోని చింతోని గుంపు జలపాతానికి వెళ్లారు. ఆయన కుమార్తె 18 ఏళ్ల పూజిత నీటిలోకి దిగింది. దీంతో అతని కుమారుడు శివాజీ ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో పూజిత ఒక్కసారిగా నీటిలో పడిపోయింది. వెంటనే సోదరుడు శివాజీ ఆమెను చేయి పట్టుకొని పైకిలాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివాజీ కూడా నీటిలోకి జారిపోయాడు. దీంతో తండ్రి సతీష్‌.. వెంటనే శివాజీని బయటకు లాగారు.
Read More: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
పూజిత కోసం ప్రయత్నించేలోపే ఆమె జలపాతంలో గల్లంతైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక యువకుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో నీటిలో గల్లంతైన పూజిత మృతదేహం లభ్యమైంది. కళ్లముందే కన్నబిడ్డ క్షణాల్లోనే తమ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇంటర్‌ చదివిన పూజిత వెటర్నరీ కోర్సు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.