యాప్నగరం

శివార్లలో శవమై తేలిన యువతి.. కామారెడ్డిలో కలకలం

Kamareddy జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో 18 ఏళ్ల ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. 4 రోజుల కిందట కనిపించకుండాపోయిన ఆమె గ్రామ శివార్లలో శవమై తేలింది.

Samayam Telugu 22 Dec 2019, 3:01 pm
యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. నాలుగు రోజుల కిందట కనిపించకుండాపోయిన 18 ఏళ్ల యువతి గ్రామ శివార్లలో శవమై తేలింది. కుమార్తె మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన పంగ అఖిల (18) నాలుగు రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు, బంధువులు తీవ్రంగా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
Samayam Telugu Representative Image


తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం (డిసెంబర్ 22) ఉదయం అన్నారం శివారులో అఖిల మృతదేహం కనిపించింది. అఖిల మరణవార్త విని తల్లిదండ్రులు, గ్రామస్థులు షాక్‌ తిన్నారు.

అఖిల ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేశారా? లేదా ప్రమాదవశాత్తూ మరణించిందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైట్ నోట్ కూడా లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Watch: రైలెక్కుతూ జారిపడ్డ మహిళ.. కానిస్టేబుల్ కాపాడారిలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.