యాప్నగరం

షాకింగ్.. తెలంగాణ పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా

Hyderabad Corona Cases: ఒకేసారి 180 కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో అకాడమీలో ఇంకా కరోనా పరీక్షలు కొనసాగుతున్నట్లు వీకే సింగ్ తెలిపారు. ప్రస్తుతం అకాడమీలో మొత్తం 1100 మందికి పైగా ఎస్సైలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు.

Samayam Telugu 28 Jun 2020, 6:35 pm
తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో కరోనా వైరస్ అలజడి సృష్టించింది. అక్కడ సుమారు 180 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. శిక్షణలో ఉన్న దాదాపు 100 మంది ట్రైనీ ఎస్సైలు, మరో 80 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లుగా అకాడమీ డైరెక్టర్ వినోయ్ కుమార్ సింగ్‌ ప్రకటించారు. అయితే, వీరందరిలో ఎవరికీ కరోనా లక్షణాలు బయట పడలేదని తెలుస్తోంది. కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించి వారందరినీ అకాడమీలోనే ఉంచినట్లు వెల్లడించారు. అక్కడే ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేసి క్వారంటైన్‌లో ఉంచినట్లు వివరించారు.
Samayam Telugu తెలంగాణ పోలీస్ అకాడమీ
telangana Police


Don't Miss: క్రికెట్ ఆడిన పీవీ నరసింహారావు, ఐశ్వర్యారాయ్‌కు ఆటోగ్రాఫ్.. మరెన్నో అరుదైన చిత్రాలు

ఒకేసారి 180 కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో అకాడమీలో ఇంకా కరోనా పరీక్షలు కొనసాగుతున్నట్లు వీకే సింగ్ తెలిపారు. ప్రస్తుతం అకాడమీలో మొత్తం 1100 మందికి పైగా ఎస్సైలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. అక్కడ శిక్షణ ఇచ్చే సిబ్బందితో కలిపి మొత్తంగా అకాడమీలో 2200 మంది ఉంటారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అకాడమీలో కలకలం రేగింది.

Also Read: చెస్ట్ ఆస్పత్రిలో ఘోరం.. ఆక్సీజన్ లేక విలవిల్లాడుతూ కొవిడ్ పేషెంట్ మృతి!Also Read: కాంగ్రెస్‌కు హస్తం గుర్తు ఎంపికలో పీవీ తెలివి భళా! ఆసక్తికర ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.