యాప్నగరం

గిన్నిస్ బుక్‌లోకి కీసర తహసీల్దార్? దరఖాస్తుకు స్పందించిన సంస్థ

Guinness World Records: భూ సెటిల్మెంట్ విష‌యంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ.2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రూ.1.1 కోట్లను ఓ రియల్టర్ నుంచి లంచం రూపంలో తీసుకుంటూ ఇటీవ‌లే రెడ్‌హ్యాండె‌డ్‌గా ఏసీబీకి చిక్కారు.

Samayam Telugu 25 Aug 2020, 9:39 pm
లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ కీస‌ర త‌హ‌సీల్దార్ నాగ‌రాజు వ్యవహారంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే రెండు సంస్థలు ఓ ఆసక్తికరమైన అంశంపై తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తహసీల్దార్ నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కించాల‌ని ఆ సంస్థను కోరాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించే ఈ రెండు స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సంప్రదించాయి.
Samayam Telugu తహసీల్దార్ నాగరాజు
keesara mro


Also Read: undefined

ఒక‌ భూ సెటిల్మెంట్ విష‌యంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ.2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రూ.1.1 కోట్లను ఓ రియల్టర్ నుంచి లంచం రూపంలో తీసుకుంటూ ఇటీవ‌లే రెడ్‌హ్యాండె‌డ్‌గా ఏసీబీకి చిక్కారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌టం ప్రపంచంలో ఇదే తొలిసారి అయి ఉండ‌వ‌చ్చని యూత్ ఫ‌ర్ యాంటీ క‌రప్షన్ (వైఏసీ) అధ్యక్షుడు ప‌ల్నాటి రాజేంద‌ర్ అన్నారు. ఈ సంస్థతో పాటు వ‌రంగ‌ల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవ‌గాహ‌న‌ కార్యక్రమాలు నిర్వహించే జ్వాల సంస్థ కూడా గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.

Must Read: రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట.. ‘మర్డర్’ సినిమాపై కీలక ఆదేశాలు

అయితే, వీరి దరఖాస్తుపై గిన్నిస్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతి రికార్డులకు సంబంధించి త‌మ‌వ‌ద్ద ఇంత‌వ‌ర‌కు అలాంటి కేటగిరీ ఏమీ లేదని స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కేట‌గిరి ప్రారంభించే విషయాన్ని ప‌రిశీలిస్తామ‌ని వెల్లడించింది.

Also Read: కరోనాపై తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలాఖరు నాటికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.