యాప్నగరం

తెలంగాణలో కొనసాగుతున్న సెకండ్ వేవ్.. తాజా కేసులు ఎన్నంటే

సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Samayam Telugu 14 Apr 2021, 10:26 am
తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. కేసులు కూడా రోజురోజుకు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. రాత్రి 8 గంటల వరకు మొత్తం 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇందులో 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Samayam Telugu కరోనా సెకండ్ వేవ్


ఇక కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. రోజువారి కేసుల సంఖ్య లక్షదాటింది. గడచిన 24 గంటలలో 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1027 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,38,73,825కు చేరినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.