యాప్నగరం

కామారెడ్డి: గంటల తరబడి మొబైల్ గేమ్‌ ఆడుతూ యువకుడి మృతి

Mobile Game: పబ్జీ తరహా గేమ్‌కు తెలంగాణలో మరో యువకుడు బలయ్యాడు. మొబైల్ ఫోన్‌లో అదే పనిగా గేమ్ ఆడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కామారెడ్డిలో 22 ఏళ్ల ఓ యువకుడు మరణించాడు.

Samayam Telugu 16 Nov 2020, 11:03 pm
మొబైల్ గేమ్‌కు బానిసై ఓ యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి పట్టణంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సాయికృష్ణ అనే 22 ఏళ్ల యువకుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ తన ఇంట్లో ఉంచుకొని ఆలనా పాలనా చూస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వారు నివాసం ఉంటున్నారు. అయితే.. ఆ యువకుడు కొంత కాలంగా తన మొబైల్ ఫోన్లో పబ్జీ తరహా వీడియో గేమ్ (చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది) ఆడుతున్నట్లు బంధువులు తెలిపారు. ఇదే క్రమంలో సోమవారం (నవంబర్ 16) ఉదయం నుంచి అదే పనిగా వీడియో గేమ్ ఆడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Mobile Game addiction


అపస్మారకస్థితిలో ఉన్న సాయికృష్ణను గుర్తించిన బంధువులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై మరణించినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: షాకింగ్! పానీ పూరీ తయారీలో టాయిలెట్ వాటర్ వాడుతున్న వ్యాపారి

Must Read: విషాదం: EMI చెల్లించలేక ఐదుగురి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.