యాప్నగరం

తెలంగాణ కరోనా కేసులు... 226 మందికి పాజిటివ్

ప్రస్తుతం రెండు లక్షల 87వేలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా గ్రేటర్‌లో కొత్తగా 39 మందికి పాజిటివ్ అని తేలింది.

Samayam Telugu 21 Jan 2021, 10:15 am
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 226 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,584కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 224 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,87,117కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in Telangana


Read More: హైదరాబాద్‌లో నిలిచిన మెట్రో.. మధ్యలోనే ప్రయాణికుల్ని దించేసిన సిబ్బంది

మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 3,920 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 2,322 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 39 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకమైన మార్పులను చేసింది. వ్యాక్సినేషన్ కు ఎవరైనా రాకపోతే, వారికి బదులుగా మరొకరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.అదే సమయంలో ఒక్కసారి కరోనా వ్యాక్సిన్ ను తిరస్కరించిన వారు మరోసారి టీకాను అడిగేందుకు అర్హులు కాదని తేల్చింది. అంటే ఒక్కసారి వ్యాక్సిన్ ను తిరస్కరిస్తే ఇంకోసారి వారికి అవకాశం ఉండనట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.