యాప్నగరం

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. ఒకేరోజు 253 కేసులు, 8 మంది మృతి

coronavirus telangana: మొత్తం లోకల్ కేసులు మాత్రం 4,288 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అయితే, శనివారం మరో 8 మంది కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 182కి చేరుకుంది.

Samayam Telugu 13 Jun 2020, 9:31 pm
తెలంగాణలో శనివారం ఒక్కరోజులోనే అత్యంత భారీ సంఖ్యలో కరోనా కేసులను గుర్తించారు. మొత్తం 253 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4737కు చేరుకుంది. వీటిలో, మొత్తం లోకల్ కేసులు మాత్రం 4288 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అయితే, శనివారం మరో 8 మంది కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 182కి చేరుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana coronavirus


శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 179 కేసులు నమోదు కాగా, సంగారెడ్డిలో 24, మేడ్చల్ 14, రంగారెడ్డిలో 11, మహబూబ్ నగర్‌లో 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్గొండ, ములుగు, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో 2 చొప్పున, సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులను గుర్తించారు. ఇక నాన్ లోకల్ కేసుల్లో శనివారం సున్నా కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

Also Read: undefined

ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారు రాష్ట్రంలో 2,352 మంది కాగా, యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 2203 ఉన్నాయి. కరోనా కారణంగా శనివారం 8 మంది మరణించారు. రాష్ట్రంలో నాన్ లోకల్ కరోనా కేసులు (వలస కార్మికులు, విదేశీయులు) 449 ఉన్నాయి.

Must Read: మంత్రి ఈటలపై వేటు వచ్చే వారమే.. కత్తి నూరుతున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.