యాప్నగరం

తెలంగాణలో కరోనా దడ.. రికార్డు స్థాయిలో కేసులు.. 192 మంది మృతులు

coronavirus telangana: బుధవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 214 కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 17 Jun 2020, 9:31 pm
తెలంగాణలో బుధవారం ఒక్కరోజులోనే అత్యంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 269 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. ఒక్క బుధవారం 1096 కరోనా టెస్టులు చేయగా అందులో 269 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం ఇప్పటి వరకూ చేసిన కరోనా టెస్టులు తెలంగాణలో 45,911 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. చనిపోయిన వారి సంఖ్య బుధవారం ఒకరు కాగా, మొత్తం సంఖ్య 192కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona tests1


బుధవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 214 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 13, కరీంనగర్‌లో 8, వరంగల్ అర్బన్‌లో 10, ములుగు, జనగామలో 5 చొప్పున, మెదక్‌, సంగారెడ్డిలో 3 చొప్పున, వనపర్తి, మేడ్చల్‌లో 2 చొప్పున, జయశంకర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లా్ల్లో ఒక్కొక్క కేసు చొప్పున గుర్తించారు.

Also Read: undefined

కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ..
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.

Must Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.