యాప్నగరం

తెలంగాణలో కరోనాతో మరో ఇద్దరి మృతి, 1661కి చేరిన కేసులు

Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసులు 1661కి చేరుకున్నాయి. బుధవారం కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరుకుంది.

Samayam Telugu 20 May 2020, 9:09 pm
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతోంది. రాష్ట్రంలో బుధవారం (మే 20) మరో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1661కి ఎగబాకింది. మృతుల సంఖ్య 40కి చేరింది. బుధవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 15 కేసులు నిర్ధారణ కాగా.. మరో 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ బారినపడ్డ వలస కార్మికుల సంఖ్య 89కి చేరింది.
Samayam Telugu నమూనా చిత్రం
Telangana Coronavirus


కరోనా నుంచి కోలుకొని బుధవారం ఇద్దరు మాత్రమే డిశ్చార్జి అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1000కి పైగా మంది కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1013 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 608 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించారు.

కరోనాతో మంగళవారం నలుగురు బాధితులు మృత్యువాతపపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించి పలు రకాల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన తొలి రోజే నలుగురు మరణించడం గమనార్హం. మృతుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికం ఉన్నారు.

Also Read: చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. మరోసారి కరోనా వ్యాప్తి

Must Read: కరోనా సంక్షోభ సమయంలో WHOలో భారత్‌కు కీలక పదవి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.