యాప్నగరం

తెలంగాణలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు

మరోవైపురాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కరోనా టీకాను అందిస్తున్నారు అధికారులు.

Samayam Telugu 17 Jan 2021, 10:31 am
తెలంగాణలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా కొత్తగా 299 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరింది. ఇందులో 2,85,898 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, 4191 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1577 మంది బాధితులు వైరస్‌ ప్రభావంతో మరణించారు. కాగా, నిన్న ఒక్కరోజే 379 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 1,577కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు


Read More: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా... మెగాఫ్యామిలీ బంధువు ?

మరోవైపు రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.02 శాతంగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నదని వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 57, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 26, కరీంనగర్‌లో 24 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో శనివారంనాడు 33,298 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,191 ఉండగా వీరిలో 2,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 74,61,687కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ప్రజలుకు కాస్త ఊరట లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.