యాప్నగరం

సూర్యాపేటలో మరిన్ని కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సూర్యాపేటలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 30కి చేరుకుంది.

Samayam Telugu 14 Apr 2020, 8:01 pm
సూర్యాపేటలో మంగళవారం మరో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన ఇద్దరికి, తిరుమలగిరిలో ఒకరికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి మంగళవారం (ఏప్రిల్ 14) వెల్లడించారు. మంగళవారం పరీక్షించిన 80 నమూనాల్లో 77 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. తాజగా నమోదైన 3 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 30కి చేరింది.
Samayam Telugu corona test


సోమవారం రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే రాష్ట్రంలో 61 పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 592కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 472 ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం కరోనాతో ఒక‌రు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 17కి చేరింది. ఇప్పటివరకు క‌రోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 103గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.