యాప్నగరం

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే ఐదుగురు మృతి

coronavirus cases telangana: దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 45కు చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1699కు చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్న వారు రాష్ట్రంలో 1036 మంది అని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Samayam Telugu 21 May 2020, 8:48 pm
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గురువారం మరింతగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 38 కరోనా పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 కరోనా కేసులు నమోదు కావడం గమనించదగ్గ విషయం. ఇదే సమయంలో గురువారం ఒక్కరోజే తెలంగాణలో ఐదుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 45కు చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1699కు చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్న వారు రాష్ట్రంలో 1036 మంది అని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


Also Read: undefined

గురువారం కరోనా నుంచి కోలుకొని 23 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 618 ఉన్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో 26 జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, మరో రెండు 2 రంగారెడ్డి జిల్లా పరిధిలో గుర్తించారు. మరో 10 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.