యాప్నగరం

చటాన్‌పల్లిలో బాలిక కిడ్నాప్..

Shadnagar: చటాన్‌పల్లిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. బైక్‌పై వచ్చిన ఓ యువకుడు నాలుగేళ్ల పాపను అపహరించుకుపోయాడు. తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

Samayam Telugu 17 Dec 2019, 10:08 pm
షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామంలో బాలిక కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు అపహరించాడు. యువకుడు బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుండగా కొంత మంది స్థానికులు చూసినట్లు సమాచారం. కిడ్నాప్‌కు గురైన బాలిక స్నేహిత షాద్‌నగర్ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది. మంగళవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం స్కూలు నుంచి వచ్చిన తర్వాత ఇంటి ముందు ఆడుకుంటుండగా యువకుడు అపహరించాడు.
Samayam Telugu Representative Image


Watch: సీసీటీవీ కెమెరాల్లో కిడ్నాపర్ దృశ్యాలు

తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైన విషయం తెలుసుకొని బాలిక తల్లిదండ్రులు రోదిస్తున్నారు. షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అట్టుడికిన ఉస్మానియా.. కాగడాలు, డప్పు దరువుల మోత
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లిలోనే చోటు చేసుకుంది. వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులు చటాన్‌పల్లి సమీపంలోని వంతెన కింద ఆమె మృతదేహాన్ని పెట్రోలు పోసి దహనం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులు కూడా డిసెంబర్ 6న అదే ప్రదేశంలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.