యాప్నగరం

తెలంగాణలో 1854కు కరోనా కేసులు.. ఒక్కరోజే నలుగురు మృతి

coronavirus cases in telangana: రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 709గా ఉన్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో 23 జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలో గుర్తించారు. 11 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకింది.

Samayam Telugu 24 May 2020, 8:23 pm
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఆదివారం మరింతగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 41 కరోనా పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1854కు చేరింది. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 23 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో నలుగురు వ్యక్తులు కరోనా వల్ల చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 53కు చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్న వారు రాష్ట్రంలో 1092 మంది అని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఆదివారం కరోనా నుంచి కోలుకొని 24 మంది డిశ్చార్జి అయ్యారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
coronavirus


ఇక రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 709గా ఉన్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో 23 జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలో గుర్తించారు. 11 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకింది. ఆదివారం మరో ఆరుగురు విదేశీయులకు కూడా కరోనా సోకినట్లుగా గుర్తించారు.

Must Read: బావిలో 9 మృతదేహాల కేసులో వీడిన మిస్టరీ.. షాకింగ్ నిజాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.