యాప్నగరం

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. ఒకేరోజు 41 కేసులు, ఇద్దరు మృతి

telangana coronavirus: మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1367కు చేరుకున్నాయి. అయితే, కరోనా నుంచి కోలుకొని బుధవారం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 117 అని పేర్కొన్నారు.

Samayam Telugu 13 May 2020, 10:05 pm
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 41 కేసులను గుర్తించినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1367కు చేరుకున్నాయి. బుధవారం కరోనా వల్ల మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 34కు చేరింది. అయితే, కరోనా నుంచి కోలుకొని బుధవారం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 117 అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 394 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా వివరించారు. మొత్తం ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 939గా ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


బుధవారం నమోదైన కరోనా వైరస్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 31 కేసులను గుర్తించారు. మరో 10 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు. వరంగల్ రూరల్ యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Also Read: undefined

ఇక కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్ జిల్లాల్లో గత 14 రోజుల వ్యవధిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ బులెటిన్‌లో వివరించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.