యాప్నగరం

తెలంగాణలో 1600 దాటిన కరోనా కేసులు.. 38కి చేరిన మృతులు

coronavirus cases telangana: మరోవైపు, మంగళవారం గుర్తించిన 42 కేసుల్లో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనించదగ్గ విషయం. మరో ఎనిమిది మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు గుర్తించారు.

Samayam Telugu 19 May 2020, 9:20 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మంగళవారం మరింతగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 42 కరోనా కొత్త కేసులను అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1634కు చేరింది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకొని మంగళవారం 9 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 585గా ఉంది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1011గా ఉంది.

మరోవైపు, మంగళవారం గుర్తించిన 42 కేసుల్లో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనించదగ్గ విషయం. మరో ఎనిమిది మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు గుర్తించారు. ఇక ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 38కి చేరింది.

Also Read: undefined

వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణ పేట, వరంగల్ అర్బన్, గద్వాల జిల్లాల్లో గత 14 రోజుల వ్యవధిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని బులెటిన్‌లో వెల్లడించారు.

Also Read:దిగ్గజ నిర్మాతపై రాజాసింగ్ ఫైర్.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.