యాప్నగరం

ఉడుకుతున్న మటన్ కూర గిన్నెలో పడ్డ బాలుడు

Kamareddy: బంధువుల కోసం ఇంటి ముందు మటన్‌ కూర వండుతున్నారు. పొయ్యి మీద అత్యంత వేడిమితో గిన్నెలో కూర ఉడుకుతోంది. ఆ చుట్టుపక్కలే ఆడుకుంటున్న రోహన్‌ పట్టు తప్పి ఆ గిన్నెలో పడిపోయాడు.

Samayam Telugu 31 Jan 2020, 9:46 am
మృత్యువు ఎప్పుడు, ఎలా, ఎటు నుంచి వస్తుందో తెలీదంటారు. దీన్ని నిజం చేసేలా కామారెడ్డి జిల్లాలో ఓ ఘటన జరిగింది. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఆడుకుంటున్న బాలుడు ఉన్నట్టుండి విచిత్ర పరిస్థితుల్లో ప్రాణాలు వదిలాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మదాంగపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బాలుడు మటన్ ఉడుకుతున్న గిన్నెలో పడి చనిపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే...
Samayam Telugu Mutton Curry
Representative Image (TOI)


Must Read: రేప్ చేస్తున్నప్పుడు మీరు చూశారా? సమత దోషుల తరపున సంచలన వ్యాఖ్యలు

స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన గౌతమి, అర్జున్‌ దంపతులకు రోహన్ అనే ఐదేళ్ల బాలుడు ఉన్నాడు. వీరు సోమవారం కామారెడ్డికి వచ్చారు. సమీప బంధువుల దశ దిన కర్మకు హాజరయ్యారు. అనంతరం బంధువుల కోసం ఇంటి ముందు మటన్‌ కూర వండుతున్నారు. పొయ్యి మీద అత్యంత వేడిమితో గిన్నెలో కూర ఉడుకుతోంది. ఆ చుట్టుపక్కలే ఆడుకుంటున్న రోహన్‌ పట్టు తప్పి ఆ గిన్నెలో పడిపోయాడు. వెంటనే స్పందించిన చుట్టుపక్కల వాళ్లు, బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: వీడియో: అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు ఆపి మద్యం కొంటూ..

బాలుడ్ని తొలుత కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా, అక్కడి వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం రాత్రి హుటాహుటిన ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగా, బుధవారం బాలుడు చనిపోయాడు.

Also Read: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనావైరస్ పరీక్షలు చూస్తారా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.