యాప్నగరం

మహిళ తల నరికి.. హయత్‌ నగర్‌లో మరో దారుణం

Hyderabad: హయత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను నరికేసి తల, మొండెం వేరు చేసి చెట్ల పొదల్లో పడేశారు. రెండు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 13 Nov 2019, 7:27 pm
హైదరాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. మహిళను నరికి చంపి తలను, మొండాన్ని వేరు చేశారు. ఈ దారుణం రెండు రోజుల కిందట జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. చెట్ల పొదల్లోంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన మహిళ మెదక్ జిల్లా జోగిపేట మండలం యారారంకు చెందిన బేతమ్మ (50)గా గుర్తించారు.
Samayam Telugu murder2
హయత్ నగర్ హత్య


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్యాడ్ బృందాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామ శివారులో బుధవారం (నవంబర్ 13) మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ జోన్ డీసీపీ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.