యాప్నగరం

తప్పతాగి, తప్పుడు మాటలు మాట్లాడి.. 50 ఏళ్ల వ్యక్తికి మహిళల దేహశుద్ధి

హయత్ నగర్‌లో 50 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆడ వాళ్లను వేధిస్తున్నాడని స్థానిక మహిళలంతా కలిసి చితకబాదారు. తర్వాత 100కు ఫోన్ చేయగా, 5 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు నిందితుడి భరతం పట్టారు.

Samayam Telugu 8 Dec 2019, 6:47 pm
దిశ ఘటన జరిగాక ‘డయల్ 100’ అంశం ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కంగారు పడకుండా ఈ నెంబరుకు ఫోన్ చేయాలని పోలీసులు విస్తృతంగా పిలుపునిస్తున్నారు. సెలబ్రిటీలు సహా సామాన్యులంతా డయల్ 100పై అవగాహన కోసం ఇదే అంశాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డయల్ 100కి ఎవరైనా ఆపదలో ఉన్న మహిళ ఫోన్ చేస్తే పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని హయత్‌ నగర్‌లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
Samayam Telugu Stop rape


Also Read: NHRC విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారు :దిశ తల్లిదండ్రులు

ఆదివారం హయత్ నగర్‌లో మహిళలు మరో కీచకుడి భరతం పట్టారు. 50 ఏళ్ల వయసున్న ఈ వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఆడ వాళ్లను వేధిస్తున్నాడని స్థానికులంతా కలిసి చితకబాదారు. దిశ హత్యాచార కేసులో దేశమంతా రగిలిన ఆగ్రహ జ్వాలలకు పోలీసుల ఎన్‌కౌంటర్ రూపంలో నలుగురు నిందితులు హతమైన నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు ఇంకా దుర్బుద్ధిని బయట పెడుతుండడం గమనార్హం.

హయత్ నగర్‌లో నివాసముంటున్న ఒక వ్యక్తి ఆదివారం తాగిన మైకంలో ఇంటి పక్కన ఉండే మహిళతో సైగలు చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాక, ఆమెతో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుండడంతో బాధితురాలు, ఇతర మహిళల సాయంతో ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసింది. తర్వాత 100కు కాల్ చేసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. 5 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని వెళ్లారు.

Also Read: నిందితుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.