యాప్నగరం

చిన్నారిపై విరుచుకుపడ్డ వీధి కుక్కలు.. ఒళ్లంతా గాయాలతో బాలిక మృతి

Boduppal: ఆరు సంవత్సరాల బాలిక అంగోత్ బేబీ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడగా ముందు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుండి మరో ఆసుపత్రికి, చివరికి నీలోఫర్ హాస్పిటల్‌కి పాపను తరలించారు.

Samayam Telugu 30 May 2020, 9:16 pm
హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఒక బాలికపై వీధి కుక్కలు దాడి చేయగా ఆమె మరణించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చంగిచర్ల సుశీల టౌన్ షిప్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బాలల హక్కుల సంఘం.. బోడుప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
stray dogs


ఆరు సంవత్సరాల బాలిక అంగోత్ బేబీ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడగా ముందు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుండి మరో ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో యశోద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పారని బాలిక తండ్రి అంగోత్ హోలీ చెప్పారు. కానీ యశోద హాస్పిటల్‌లో కూడా బాలికకు వైద్యం చేయలేదని వివరించారు. చివరకు నీలోఫర్ హాస్పిటల్‌కి పాపను తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

వీధికుక్కలను మున్సిపాలిటీలు వెంటనే నిర్మూలించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. బోడుప్పల్ మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.

Also Read:బిగ్ న్యూస్.. జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

Must Read:
undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.