తెలంగాణలో కరోనా వైరస్ కేసులు శుక్రవారం (మే 22) మరీ ఎక్కువగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 62 కరోనా పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1761కు చేరింది. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 42 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో ముగ్గురు కరోనా వల్ల చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 48కు చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్న వారు రాష్ట్రంలో 1043 మంది అని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. శుక్రవారం కరోనా నుంచి కోలుకొని ఏడుగురు డిశ్చార్జి అయ్యారు.
Must Read: undefined
ఇక రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 670గా ఉన్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో 42 జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలో గుర్తించారు. మొత్తం 19 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకడం విస్మయం కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణకు చెందిన వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటుండడంతో వారి వల్ల కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.
Also Read: undefined
undefined
Must Read: undefined
ఇక రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 670గా ఉన్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో 42 జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలో గుర్తించారు. మొత్తం 19 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకడం విస్మయం కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణకు చెందిన వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటుండడంతో వారి వల్ల కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.
Also Read: undefined
undefined