యాప్నగరం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత

కార్గో విమానంలో జైపూర్, ముంబైకు తరలిస్తున్న పెట్టెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు, స్టెయిన్ లెస్ స్టీల్ గడియారాలు స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 5 Oct 2020, 10:28 am
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. అధికారులు ఎంత పకడ్బందీగా అధికారులు తనిఖీలు చేపడుతున్నా కొందరు అక్రమార్కులు బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి రహస్యంగా తరలిస్తున్న దాదాపు 8 కిలోల బంగారం, ఇతర విలువైన వస్తువులున్న బాక్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కార్గో విమానంలో ఈ నెల 3న జైపూర్‌, ముంబైకు తరలిస్తున్న పెట్టెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 21 కిలోల బరువున్న ఈ బాక్స్‌ను నిన్న అధికారులు తెరిచారు.
Samayam Telugu శంషాబాద్ ఎయిర్‌పోర్టు
hyderabad airport


Read More: తెలంగాణలో రెండు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

అందులో 2.37 కిలోల బంగారు బిస్కెట్లు, 5.63 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలు, స్టెయిన్‌లెస్ స్టీల్ గడియారాలు, ప్లాటినం టాప్స్‌తోపాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్టు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 6,62,46,387 ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో వీటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ అది ఎవరిదన్న వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.