యాప్నగరం

వాగు ఉగ్రరూపం.. చిక్కుకున్న 8 మంది, ప్రాణాలకు తెగించిన స్థానికులు.. వీడియో

Telangana Rains: గ్రామంలో నివాసం ఉండే దశరథ్ తన కుటుంబ సభ్యులు 8 మందితో కలిసి ఉదయం పొలానికి వెళ్లాడు. పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరుగుముఖం పట్టేలోపే భారీ వర్షం కురిసింది.

Samayam Telugu 16 Sep 2020, 9:30 pm
వికారాబాద్‌ జిల్లాలోని షాపూర్ తండాలో విషాదం చోటు చేసుకుంది. మర్పల్లి మండలం షాపూర్ తండాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు ఒకరిని బలిగొంది. గ్రామం సమీపంలో ఉన్న వాగులో ఎనిమిది మంది చిక్కుకోగా స్థానికులు ఎన్నో కష్టాలు పడి ఏడుగురిని రక్షించారు. ఒకరు మాత్రం చనిపోయారు. గ్రామంలో నివాసం ఉండే దశరథ్ తన కుటుంబ సభ్యులు 8 మందితో కలిసి ఉదయం పొలానికి వెళ్లాడు. పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరుగుముఖం పట్టేలోపే భారీ వర్షం కురిసింది.
Samayam Telugu ప్రాణాలకు తెగించి రక్షిస్తున్న స్థానికులు
8 people stucks in flood in vikarabad dist, locals evacuated 7 members


దీంతో అప్పటికప్పుడే సమీపంలోని వాగు ఉగ్రరూపంతో ప్రవహించడం మొదలైంది. దశరథ్ కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో 8 వ్యక్తులు వాగులో కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి తాళ్ల సాయంతో ఆరుగురు పిల్లలను కాపాడారు. దశరథ నాయక్ తన భార్యను కాపాడుకున్నాడు. కానీ, ఆమె అప్పటికే చనిపోయింది. స్థానికులు ప్రాణాలకు తెగించి వారిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.