యాప్నగరం

తండ్రి సమాధి వద్ద రెండ్రోజులుగా ఏడుస్తున్న బాలిక.. జగిత్యాలలో కన్నీరు పెట్టించే ఘటన

Jagityal: కొండగట్టు ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యల మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన ద్యాగాల స్వామి కూడా చనిపోయారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

Samayam Telugu 12 Sep 2020, 10:42 pm
జగిత్యాల జిల్లాలో కన్నీరు పెట్టించే ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. రెండేళ్ల కిందట కొండగట్టు దగ్గర ఘోరమైన బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోయారు. ఆ విషాదకర దుర్ఘటనలో చనిపోయిన తన తండ్రి జ్ఞాపకాల నుంచి చిన్నారి అక్షిత బయటపడలేపోతోంది. రెండేళ్ల క్రితం కట్టిన తండ్రి సమాధిపై కూర్చుని తొమ్మిదేళ్ల పాప వెక్కివెక్కి ఏడిచింది. ఆ పాపను ఓదార్చడం స్థానికుల వల్ల ఏమాత్రం కాలేదు.
Samayam Telugu తండ్రి సమాధి కుమార్తె
girl sits on her fathers Tomb


కొండగట్టు ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యల మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన ద్యాగాల స్వామి కూడా చనిపోయారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అప్పటి నుంచి ద్యాగాల స్వామి కుమార్తె ఆ మనోవేదనలోనే ఉండిపోయినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగి శుక్రవారంతో రెండేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంది. దీంతో గత రెండు రోజులుగా సమాధి దగ్గరే కూర్చొని ఆ చిన్నారి ఏడుస్తోంది. తన తండ్రి సమాధిపై పూలు వేస్తూ అక్కడే ఉండిపోయింది. ఇది చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టుకుంటుండడం కలచివేసింది.

Must Read: మెదక్: చోరీకి షాపులోకి వెళ్లిన దొంగ.. సజీవ దహనమై బయటికి..Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.