యాప్నగరం

తెలంగాణలో కరోనాతో మరో ఐదుగురి మృతి

Hyderabad Coronavirus: తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనాతో రాష్ట్రంలో మరో ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 142కు చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 3742కు ఎగబాకింది.

Samayam Telugu 8 Jun 2020, 11:02 pm
తెంగాణలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో సోమవారం (జులై 8) మరో ఐదు మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3742కు చేరుకుంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 142కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Samayam Telugu తెలంగాణ కరోనా వైరస్ కేసులు
Telangana Coronavirus


ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో కరోనాతో 14 మంది మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఒక్కరోజులో ఇప్పటివరకు ఇవే అత్యధిక మరణాలు. ఆదివారం కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 132 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో 1742 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 1771 యాక్టివ్ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

టెన్త్ పరీక్షలు రద్దు, సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్
కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రి ఫైనల్ పరీక్షల గ్రేడింగ్‌ల ద్వారా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు.. లాక్‌డౌన్‌తో రెండున్నర నెలలుగా నిలిచిపోయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతి ఇస్తూ సీఎం కేసీఆర్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగులు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. తక్కువ సిబ్బందితో షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. సినిమా హాళ్లు తెరిపించడానికి మరి కొన్ని రోజులు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు.

Must Read: 4 లక్షలు దాటిన కరోనా మరణాలు

Also Read: గద్వాలతో పరువు హత్య.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.