యాప్నగరం

తెలంగాణలో మరో 94 కేసులు, 6 మరణాలు

Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2792కు చేరుకున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మంది మరణించారు.

Samayam Telugu 1 Jun 2020, 8:51 pm
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సోమవారం (జూన్ 1) మరో 94 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం లోకల్ కేసుల సంఖ్య 2358కు చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. వలస కార్మికులు, విదేశీయులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2792కు ఎగబాకాయి.
Samayam Telugu నమూనా చిత్రం
Telangana Corona Deaths


కరోనా కారణంగా తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 88కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1213 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించారు. కనోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 1491 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని వెల్లడించారు. వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 434 మందికి కరోనా వైరస్ సోకింది.

సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 79 ఉన్నాయి. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్‌లో 3 కేసులు నమోదయ్యాయి. మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి కేసులు, మహబూబాబాద్, పెద్దపల్లి, జనగాం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. జనగాం జిల్లాలో ఓ గర్భిణికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

Also Read: 13 మంది ఉగ్రవాదుల హతం.. పాక్ బోర్డర్‌లో ఆర్మీ కీలక విజయం

Also Read: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.