యాప్నగరం

ORR: లారీ నుంచి కింద పడి క్లీనర్ మృతి.. గమనించకుండా పోయిన డ్రైవర్

Shamshabad: డ్రైవర్ లారీని వేగంగా నడుపుతుండగా, క్లీనర్ నిద్ర మత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిద్ర మత్తులోనే ఆయన లారీ క్యాబిన్ నుంచి జారి పడిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Samayam Telugu 18 Feb 2020, 11:25 am
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద గల కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్‌ రింగ్ రోడ్డుపై విషాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ నుంచి క్లీనర్ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అయితే, క్లీనర్ కింద పడిపోయిన విషయం గమనించని డ్రైవర్ యథావిధిగా అంతే వేగంతో ముందుకు వెళ్లిపోయాడు. దీంతో లారీ నుంచి కింద పడ్డ క్లీనర్ రోడ్డుపై దొర్లుతూ బలమైన గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రైవర్ ఆచూకీ తెలియకపోవడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Samayam Telugu accident-mbnr


Must Read: కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఇబ్బందులు

డ్రైవర్ లారీని వేగంగా నడుపుతుండగా, క్లీనర్ నిద్ర మత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిద్ర మత్తులోనే ఆయన లారీ క్యాబిన్ నుంచి జారి పడిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, క్లీనర్ పడిపోయి కనిపించకపోయినా లారీ డ్రైవర్ గుర్తించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు క్లీనర్ డ్రైవర్‌తోపాటు క్యాబిన్‌లో ఉన్నాడా లేక వెనుక లగేజీ ఉంచే ప్రాంతంలో ఉన్నాడా అనేది పరిశీలిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: సీఏఏతో ఎవరికి నష్టమో చెప్పండి.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Also Read: పంజాగుట్టలో దొంగల హల్‌చల్.. తలపై సుత్తితో మోది చోరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.