యాప్నగరం

హిమాయత్‌సాగర్ గేట్ల ఎత్తివేత.. మూసిలోకి రెండు మొసళ్లు, స్థానికుల్లో కలవరం

Hyderabad Rains: తొలుత స్థానికులకు మొసలి కదలికలు కనిపించడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఈ విషయం గమనించి వారు పోలీసులకు, జంతు ప్రదర్శనశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Samayam Telugu 17 Sep 2020, 7:20 pm
హైదరాబాద్ అఫ్జల్ గంజ్ సమీపంలోని పురానాపూల్ బ్రిడ్జి వద్ద మొసలి కలకలం రేపింది. నదిలో నుంచి ఒడ్డుకు వచ్చిన మొసలి చాలా సేపు అలాగే కదలకుండా ఉండిపోయింది. దాన్ని చూసి సమీప ప్రాంతాలవారు భయపడ్డారు. బుధవారం నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదకు మొసలి అక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
Samayam Telugu మూసీ ఒడ్డున కనిపించిన మొసలి
A crocodile appears near puranapool bridge in musi river


హిమయత్ సాగర్ లేదా ఉస్మాన్ సాగర్ నిండడంతో గేట్లు తెరిచారు. ఇలా ఆ జలాశయం నుంచి మొసలి నగరంలోకి ప్రవేశించిందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆ మొసలిని చూడడానికి వచ్చిన గుంపును నియంత్రించడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Also Read: undefined

తొలుత స్థానికులకు మొసలి కదలికలు కనిపించడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఈ విషయం గమనించి వారు పోలీసులకు, జంతు ప్రదర్శనశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. జూ సిబ్బంది పురానాపూల్ వంతెన వద్దకు చేరుకొని మొసలిని పట్టుకొని తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే అది నీటిలోకి వెళ్లిపోయింది. సిబ్బంది దాన్ని పట్టుకొని బంధించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

గతంలోనూ ఇదే విధంగా ఓ మొసలి నిజామాబాద్ ప్రజలలో భయాందోళన రేపింది. గత ఏడాది సెప్టెంబరులో మెన్డోరా మండలంలోని దుస్గావ్ గ్రామంలో జాతీయ రహదారి 44 వద్ద కనిపించింది. వర్షాల కారణంగా గోదావరి ప్రవాహంలో మొసలి కొట్టుకువచ్చినట్లు చెబుతున్నారు.

Must Read:undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.