యాప్నగరం

Double Bed Room: అమాయకుల కళ్లు కప్పి రూ.లక్షల్లో వసూలు.. ముఠా అరెస్టు

Jubilee hills: వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులలో ఏ1 శేరియర్ ఆలీ పరారీలో ఉన్నాడని చెప్పారు.

Samayam Telugu 18 Feb 2020, 3:58 pm
హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్లు మంజూరు చేయిస్తామని నమ్మించి, ఏకంగా 75 మందికి ఈ ముఠా టోకరా వేయడం విస్మయం కలిగిస్తోంది. వీరిలో ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ వసూలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ టోకెన్లు, జీహెచ్ఎంసీ ఫేక్ లెటర్లతో మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ముఠాల నుంచి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Samayam Telugu Double bed room houses


వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులలో ఏ1 శేరియర్ ఆలీ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇతను జీహెచ్ఎంసీలో పని చేస్తున్నాడు. బాధితుల నుంచి ఈ ముఠా రూ.15 లక్షల వరకు వసూలు చేసింది. అందరి వద్దా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేశారు.

Must Read: శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన.. సభలో తలసానికి రైల్వే మంత్రి గట్టి కౌంటర్

సుమారు 75 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి రూ.18 వేల వరకు వసూలు చేశారని ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితుల నుంచి 10 ఫేక్ టీఆర్ఎస్ పార్టీ టోకెన్లు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇలాంటి మోసగాళ్లు ఎవరైనా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు.

Must Read: కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో విద్యుత్ రంగానికి తీవ్ర ఇబ్బందులు

Also Read:
పోలీసులకు కొణిదెల ఉపాసన పాఠాలు.. వైరల్ అవుతున్న పోస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.