యాప్నగరం

పెద్దాయన చిరకాల కోరిక తీర్చిన కరోనావైరస్.. ఏకంగా 33 ఏళ్లుగా..

Hyderabad: ఓ వ్యక్తి తన కల నెరవేర్చుకొనేందుకు ఏకంగా 33 ఏళ్ల నుంచి శ్రమిస్తున్నాడు. ఏటా అందులో ఫెయిలవుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ ఏళ్ల నాటి కోరిక ఏంటనుకుంటున్నారా? పూర్తి వివరాలివీ..

Samayam Telugu 30 Jul 2020, 5:33 pm
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుండడం వల్ల యావత్ మానవాళి అవస్థలు పడుతుంటే.. హైదరాబాద్‌కు చెందిన ఓ పెద్దాయనకు మాత్రం ఈ కష్ట కాలం వల్ల తన చిరకాల కోరిక నెరవేరింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆ వ్యక్తి తన కల నెరవేర్చుకొనేందుకు ఏకంగా 33 ఏళ్ల నుంచి శ్రమిస్తున్నాడు. ఏటా అందులో ఫెయిలవుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ ఏళ్ల నాటి కోరిక ఏంటనుకుంటున్నారా? పూర్తి వివరాలివీ..
Samayam Telugu నూర్ ఉద్దీన్
noor uddin


హైదరాబాద్‌కు చెందిన నూరుద్దీన్ అనే వ్యక్తి తొలిసారిగా 1987 సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాశారు. అప్పుడు ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన పాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏటా పరీక్షలో పాస్ మార్కులైన 35 మార్కులకు దగ్గరగా వచ్చి ఆగిపోతున్నారు. ఇలా ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఆయనకు 51 సంవత్సరాలు వచ్చాయి. మళ్లీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుందామనుకుంటే ఆయనకు అవకాశం లేకుండా పోయింది. తర్వాత ఓపెన్ స్కూల్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇందులో అన్ని పరీక్షలూ రాయాల్సి వచ్చింది. ఇందుకు రూ.3 వేలు ఫీజు కూడా చెల్లించారు.

Also Read: undefined

కట్ చేస్తే.. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. లాక్ డౌన్ విధించారు. పాఠశాల పరీక్షలన్నీ రద్దు చేసేశారు. ఇది నూరిద్దీన్‌కు బాగా కలిసొచ్చింది. రెగ్యులర్ వాళ్లకు మాత్రం వారికి గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా పాస్ చేశారు. ఓపెన్ స్కూల్ విధానంలో అప్లై చేసిన వారికి మాత్రం అందరికీ 35 మార్కులు ఇచ్చి పాస్ చేసేశారు. దీంతో నూరుద్దీన్ అలనాటి కల కరోనా కారణంగా నెరవేరినట్లయింది.

Don't Miss: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.