యాప్నగరం

ఖమ్మంలో కీచకుడు.. లెక్చరర్‌కి మహిళలు బడితపూజ.. వీడియో

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఒక కాంట్రాక్ట్ బేసిస్ ఉపాధ్యాయుడిని మహిళలు చితకబాదారు.

Samayam Telugu 30 Oct 2020, 9:46 pm
ఖమ్మం జిల్లాలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో అందరూ కలిసి ఆయనకు దేహశుద్ధి చేశారు. చేసేదేమో ఉపాధ్యాయ వృత్తి.. కానీ వక్రబుద్ధి మనస్తత్వం కలవాడని మహిళలు ఆరోపించారు. వయసు పెరుగుతున్నా అతనిలో వక్ర బుద్ధి మారలేదని మండిపడ్డారు. పదేళ్ల క్రితం ఇంటర్ విద్యార్థినులతో లైంగిక వేదింపులకు పాల్పడిన వ్యక్తే.. ఇప్పుడు డిగ్రీ కళాశాలలో కూడా ఒక మహిళా అధ్యాపకురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Samayam Telugu లెక్చరర్ వాహనాన్ని ధ్వంసం చేస్తున్న బంధువులు
khammam


వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఒక కాంట్రాక్ట్ బేసిస్ ఉపాధ్యాయుడిని మహిళలు చితకబాదారు. దీన్ని సెల్ ఫోన్‌లో చిత్రికరించారు. ఆ ప్రబుద్ధుడి ప్రవర్తనలో మార్పు రావకపోవడంతో ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. ఇప్పటి వరకు ఈ సంఘటన మీద పోలీసులకు ఏలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.