యాప్నగరం

పూరీ కర్రీలో జెర్రి కలకలం.. హోటల్ నిర్వాకం..!

Shadnagar: కొన్ని హోటళ్లలో ఈగలు, దోమలు కూడా వస్తుంటాయని ఇతర వినియోగదారులు తెలిపారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే హోటల్ నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Samayam Telugu 28 Dec 2019, 6:22 pm
ఓ హోటల్‌లో పూరీ కూరలో జెర్రి కనిపించడం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ హోటల్‌లో ఓ వ్యక్తి టిఫిన్ చేసేందుకు వెళ్లగా ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో జీవితంలో మళ్లీ పూరీ తినాలనిపించడం లేదని ఆ వ్యక్తి చమత్కరిస్తున్నాడు.
Samayam Telugu Hotels in Shadnagar.


Also Read: వీడియో: మన చదువులు ఇంత దారుణమా..? టీచర్లపై మంత్రి హరీశ్ ఫైర్

షాద్ నగర్ పట్టణానికి చెందిన సమేద్ అనే వ్యక్తి స్థానిక బాలాజీ హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని పూరీ ఆర్డర్ చేశాడు. అయితే, టిఫిన్ చేస్తున్న సమయంలో ఆలుగడ్డ కూరలో జెర్రీ పాము కనిపించింది. దాంతో ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. మరీ ఇంత నిర్లక్ష్యంగా హోటల్ నిర్వహకులు ఎలా ప్రవర్తిస్తున్నారని బాధితుడు నిలదీశాడు. పూరీ కూరలో ఏకంగా జెర్రి పిల్ల ప్రత్యక్షమైతే, మిగతా ఆహార పదార్థాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు.

Also Read: ‘నీ సంగతి చూస్తా హైదరాబాద్ కమిషనర్..’ ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

అయితే, ఎక్కువగా షాద్ నగర్ పట్టణంలోని కొన్ని హోటళ్లలో ఈగలు, దోమలు కూడా వస్తుంటాయని ఇతర వినియోగదారులు తెలిపారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలా హోటల్ నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ నిర్వహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.

Also Read: కాంగ్రెస్ ర్యాలీ: ‘పోలీసులంతా కేసీఆర్‌కు తొత్తులుగా మారారు’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.