యాప్నగరం

Kukatpally: చికెన్ బిర్యానీలో ఇనుప తీగలు.. రెస్టారెంట్‌కు జరిమానా!

Hyderabad: బిర్యానీ తింటుండగా నోట్లో పంటి కింద గట్టిగా తగిలింది. రాయి అనుకొని, వేలితో బయటకు తీయగా ఇనుప తీగ కనిపించింది. ఈ వ్యవహారంపై శ్రీనివాస్ జొమాటో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 17 Jan 2020, 10:54 am
హైదరాబాద్‌కు చెందిన ఓ రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగా తగిన మూల్యం చెల్లించుకుంది. బిర్యానీలో ఇనుప తీగ రావడం సంచలనం రేపింది. నగరంలోని కూకట్ పల్లికి చెందిన ఈ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బిర్యానీ, పెరుగన్నం ఆర్డరు చేసి తింటుండగా, అందులో ఇనుప తీగ వచ్చింది. వివరాలివీ..
Samayam Telugu Chicken biryani.


Also Read: Muncipal Elections: ‘ఇల్లు అలా ఉంటే మున్సిపల్‌ పన్ను రద్దు’

కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా స్థానిక రెస్టారెంట్ నుంచి బిర్యానీ, పెరుగన్నం ఆర్డరు చేశాడు. ఇంటి వద్ద ఆహారం అందుకున్న అనంతరం.. శ్రీనివాస్ ముందుగా బిర్యానీ తినడం ప్రారంభించాడు. బిర్యానీ తింటుండగా నోట్లో పంటి కింద గట్టిగా తగిలింది. రాయి అనుకొని, వేలితో బయటకు తీయగా ఇనుప తీగ కనిపించింది. ఈ వ్యవహారంపై శ్రీనివాస్ జొమాటో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ముందు జొమాటో వారు అతనికి క్షమాపణలు చెప్పి, ఓ రాయితీ కూపన్ ఇచ్చారు. దీనిపై తాము తగిన చర్యలు తీసుకుంటామని జొమాటో పేర్కొంది.

Also Read: Hyderabad: మరింత పెరగనున్న చలి.. ఆ ప్రాంతాల్లో ఇంకా!

అంతటితో ఊరుకోని శ్రీనివాస్ జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ట్విట్టర్‌లో బిర్యానీ విక్రయించిన రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు కూకట్ పల్లిలోని రాజా వారి రుచులు రెస్టారెంట్‌‌లో తనిఖీలు చేసి, ప్రమాణాలు పాటించనందున రూ.5 వేల జరిమానా విధించారు. బిర్యానీలో ఇనుపతీగ వచ్చిన ఘటనపై తాను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస్ చెప్పారు.

Also Read: CAA 2019: మైనార్టీల కోసం కేటీఆర్ గుండె తరుక్కుపోతోంది: బీజేపీ ఎంపీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.