యాప్నగరం

వరద సహాయక చర్యల్లో అపశ్రుతి.. పడవ బోల్తా, బాధితుల ఆర్తనాదాలు.. వీడియో

Tolichowki: బోటులో అందరూ మహిళలు, పిల్లలే ఉన్నారు. బాధితులను కాపాడుతున్న సహాయక సిబ్బంది బోటులో పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించడంతో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 14 Oct 2020, 11:32 pm
హైదరాబాద్‌లోని టోలీచౌకీలో ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న సహాయక కార్యక్రమాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టోలీచౌకిలోని కొన్ని కాలనీల్లో దాదాపు మెడ వరకూ వరద నీరు నిలిచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరద బాధితులను బయటకి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తూ బోటు తిరగబడింది. దీంతో అందులో ఉన్న వారంతా నీళ్లలో పడిపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది వారిని కాపాడారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu తిరగబడుతున్న బోటు
boat capsize in tolichowki


అయితే, ఆ బోటులో అందరూ మహిళలు, పిల్లలే ఉన్నారు. బాధితులను కాపాడుతున్న సహాయక సిబ్బంది బోటులో పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించడంతో ఈ ఘటన జరిగింది. అప్పటికే పడవ అటూ ఇటూ ఊగుతూ ఉండడంతో పిల్లలు, మహిళలు భయంతో అరిచారు. చుట్టుపక్కల వారు కూడా పడవలో నుంచి కొంత మందిని దింపేయాల్సిందిగా సూచించినా వారు వినలేదు. దీంతో బోటు అదుపు తప్పి తిరగబడింది. అందరూ వరద నీటిలో పడిపోయారు.

ఇక తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వీధుల్లో పార్క్ చేసిన కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.