యాప్నగరం

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Medak: ప్రమాదం జరిగిన సమయం రాత్రివేళ కావడం, అక్కడ వీధి లైట్లు ఏమీ లేకపోవడంతో కాస్త ఇబ్బంది తలెత్తింది. స్థానికులు సెల్‌ఫోన్ల లైట్లు వేసి గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టారు.

Samayam Telugu 1 Oct 2020, 9:22 pm
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొల్చారం మండలంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వేగంగా వస్తున్న కారు.. మెదక్ నుంచి కిష్టాపూర్ వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది ఉండడం గమనార్హం. చనిపోయినవారిలో మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన రెండేళ్ల శ్రీవర్షిణి, వారిగుంతమ్ గ్రామానికి చెందిన 46 ఏళ్ల ముత్యాల నిర్మల, అప్పాజీపల్లి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి అతినగరం సుమలత అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి చనిపోయాడు.
Samayam Telugu మెదక్ యాక్సిడెంట్
medak accident


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయం రాత్రివేళ కావడం, అక్కడ వీధి లైట్లు ఏమీ లేకపోవడంతో కాస్త ఇబ్బంది తలెత్తింది. స్థానికులు సెల్‌ఫోన్ల లైట్లు వేసి గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టారు. పరిస్థితి విషమించిన వారిని హైదరాబాద్‌కు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.