యాప్నగరం

గోడలు బద్దలు కొట్టుకొని.. స్కూల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, పిల్లలు పరుగులు

Khammam: ట్రాక్టర్ కింద పడి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే డ్వాక్రా మహిళ చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతురాలు రోజూ మధ్యాహ్న పథకంలో భాగంగా పిల్లలకు భోజనం వండుతుందని స్థానికులు తెలిపారు.

Samayam Telugu 24 Feb 2020, 5:23 pm
ఖమ్మం జిల్లాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో వివిధ పనుల కోసం వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి స్కూలు భవనంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడున్న స్కూలు విద్యార్థులంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
Samayam Telugu Capture


ట్రాక్టర్ కింద పడి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే డ్వాక్రా మహిళ చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతురాలు రోజూ మధ్యాహ్న పథకంలో భాగంగా పిల్లలకు భోజనం వండుతుందని స్థానికులు తెలిపారు. మరోవైపు ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు పరగులు తీశారు. తమ పిల్లలకు ఎలాంటి అపాయం జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.