యాప్నగరం

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రకు చుక్కెదురు

ACB Court: మంగళవారం నాడు కోర్టులో జరిగిన విచారణకు నిందితులు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరయ్యారు.

Samayam Telugu 8 Dec 2020, 11:08 pm
2015లో తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఓ నిందితుడు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కోర్టులో చుక్కెదురైంది. ఆ కేసు నుంచి తన పేరును తొలగించాలని ఎమ్మెల్యే డిశ్చార్జ్ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను హైకోర్టు డిసెంబర్‌ను కొట్టివేసింది. కేసుల్లో మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం నాడు కోర్టులో జరిగిన విచారణకు నిందితులు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరయ్యారు. ఈ నెల 15న కోర్టు విచారణకు నిందితులు కచ్చితంగా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
Samayam Telugu సండ్ర వెంకట వీరయ్య
sandra venkata veeraiah


తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్‌సన్‌‌ను ప్రలోభాలకు గురి చేసిన ఆరోపణలతో అప్పటి టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహాలపై ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్‌సన్‌కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షల నగదును ఇస్తున్న వీడియోలు సైతం అప్పట్లో కలకలం సృష్టించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు ఈ బేరం ఆడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, స్టీఫన్ సన్‌తో పలువురు టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలు సైతం అప్పట్లో వెలుగు చూశాయి. కాగా ఇదే కేసులో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జైలుకెళ్లాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.