యాప్నగరం

ఏసీపీ నరసింహ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాల్లో మరో ట్విస్ట్

Secunderabad: 12 చోట్ల ఏకాకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు కొనసాగుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని గంగాధర ఎంపీపీ శ్రీరాం మధుకర్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు.

Samayam Telugu 23 Sep 2020, 5:45 pm
సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ నరసింహ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సోదాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రజా ప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబందాలు కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కొండాపూర్ లోని సర్వే నెంబర్ 64లో అసైన్డ్ భూమిని ఏసీపీ నరసింహ రెడ్డి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాల్లో అధికారులు అసైన్డ్ భూమిని కొనుగొలు చేసిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu ఏసీపీ ఇంట్లో సోదాలు
Malkajgiri ACP Narasimha Reddy


మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ విచారణలో ఏసీపీ నరసింహ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా గంగాధరలోని మధుకర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో వారిని చూసి మధుకర్ పరారయ్యాడు. ఘట్‌కేసర్ సమీపంలోని యమాన్ పేట్‌లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కూడా కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నిజాం కాలం నాటి భూమిని రాజకీయ నాయకులతో కలిసి కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

12 చోట్ల ఏకాకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు కొనసాగుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని గంగాధర ఎంపీపీ శ్రీరాం మధుకర్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఎంపీపీ ఇంట్లోకి మీడియాను మాత్రం ఏసీబీ అధికారులు అనుమతించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.