యాప్నగరం

Ameenpur Rape Case: నిందితులు చెప్పిన విషయాలకు పోలీసులు షాక్!

Hyderabad: నిందితులు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, అనాథాశ్రమంలో పిల్లలకు సేవ చేస్తున్నామని చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

Samayam Telugu 18 Aug 2020, 8:46 pm
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమీన్ పూర్ చిన్నారి లైంగిక దాడి కేసులో నిందితుల రెండు రోజులు కస్టడీ ముగిసింది. రెండు రోజులు విచారణలో పలు అంశాలుపై విచారణ చేసి నిందితులను వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు. అయితే చిన్నారిపై జరిగిన లైంగిక దాడిపై ముగ్గురు నిందితులు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ఏర్పాటు కమిటీ సైతం పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తుంది. బాలిక పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక మరికొన్ని విషయాలు బయటపడతాయని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు చేసిన విచారణ నివేదికను ఆగస్టు 20వ తేదీ ప్రాథమిక నివేదిక కమిటీ అందజేయనుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Ameenpur rape case


రెండ్రోజుల విచారణలో నిందితులు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆశ్రమంలో జరుగుతున్న చీకటి కోణాలను దాచి పెడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, అనాథాశ్రమంలో పిల్లలకు సేవ చేస్తున్నామని చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. చిన్నారిపై లైంగిక దాడి కేవలం వేణుగోపాల్ రెడ్డి ఒక్కరే చేశారా? లేక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ఆరా తీశారు. వేణుగోపాల్ రెడ్డితో పాటు మరో ఫార్మా కంపెనీకి చెందిన ఉద్యోగి ఆశ్రమానికి వచ్చేవాడని విచారణలో వెల్లడైంది.

Must Read: undefined

మారుతి ఆశ్రమం పేరుతో నిర్వహకులు రెండు బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. ఒకటి అమీన్ పూర్ కాగా, మరొకటి మియాపూర్‌లో ఉంది. అయితే అమీన్ పూర్‌లో ఉన్న మారుతి అనాథాశ్రమానికి ఎలాంటి అనుమతులు లేవని, ఓ చైల్డ్ వెల్ఫెయిర్ అధికారితో నిందితుడు వేణుగోపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం , స్థానిక అధికారులు కూడా చూసి చూడకుండా వ్యవహరించినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

Also Read: అప్పటిలా చేస్తే గణేష్ విగ్రహాలు కేసీఆర్ ఫాంహౌస్‌కు తరలించేస్తాం: ఎమ్మెల్యే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.