యాప్నగరం

ESI స్కాం: చంచల్‌గూడ జైల్లో నిందితురాలి ఆత్మహత్యాయత్నం

Chanchalguda సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. కేసుతో మనస్తాపానికి గురై అధిక మోతాదులో మాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.

Samayam Telugu 19 Oct 2019, 9:48 pm
ఎస్‌ఐ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలానికి దారితీసింది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పద్మ శనివారం (అక్టోబర్ 19) సాయంత్రం బలవన్మరణానికి ప్రయత్నించారు. జైలులో ఉన్న పద్మ అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం ఆమెకు జైల్లో వైద్య సిబ్బంది మాత్రలు ఇచ్చారు. ఆ మాత్రలను ఎక్కువ మోతాదులో వేసుకుని పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. ఒకేసారి ఆరు మాత్రలు తీసుకున్నట్లు సమాచారం.
Samayam Telugu ESI scam


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న జాయింట్ డైరెక్టర్ పద్మను ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ఆమెను రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉంచారు. ఈఎస్‌ఐ కేసుతో తన ప్రతిష్ట మసకబారడంతో మనస్తాపానికి గురైన పద్మ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: మహిళా కండక్టర్‌పై బస్సులోనే తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యం

పద్మ ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయాన్ని గమనించిన జైలు సిబ్బంది.. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం పద్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈఎస్ఐలోని ఐఎమ్‌ఎస్‌ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఐఎమ్‌ఎస్‌ ఉద్యోగులు, మెడికల్‌ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దండుకున్నాయని అనేక ఫిర్యాదులు రావడంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఈఎస్‌ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఏసీబీకి లేఖ రాశారు.

Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తూ విద్యార్థిని మృతి

వరంగల్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ స్కాంపై ఏసీబీ రెండు నెలల పాటు విచారణ చేసింది. ఈఎస్ఐకి సంబంధించి పలు రికార్డులను, కొనుగోళ్ల డాక్యుమెంట్లను పరిశీలించిన విజిలెన్స్‌ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందించారు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ కుంభకోణం జరుగుతున్నట్లు ఏసీబీ నిర్ధారించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.