యాప్నగరం

AIMIM నేత కాల్పుల ఘటన.. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు

ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్ జమీర్.. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచాడు.

Samayam Telugu 26 Dec 2020, 10:18 am
ఆదిలాబాద్‌లో ఇటీవల కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్‌ జమీర్‌ చికిత్స పొందుతూ చనిపోయాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమీర్.. పరిస్థితి విషమించడంతో నేడు (శనివారం) కన్నుమూశాడు. డిసెంబర్ 18న ఆదిలాబాద్ తాటిగూడలో ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్‌.. జమీర్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బుల్లెట్ దిగడంతో గాయపడిన జమీర్‌ను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Samayam Telugu adilabad firing incident


వారం రోజుల క్రితం ఆదిలాబాద్ తాటిగూడలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ అయిన ఫరూక్ అహ్మద్ తుపాకీ, తల్వార్‌తో వీరంగం సృష్టించాడు. పాతకక్షల నేపథ్యంలో.. ఫరూక్‌ అహ్మద్‌ ప్రత్యర్థి వర్గానికి చెందిన సయ్యద్ జమీర్, మోతేషాన్‌పై కాల్పులు జరిపాడు. సయ్యద్ మన్నన్ అనే వ్యక్తిపై తల్వార్‌తో దాడికి దిగాడు.

తీవ్రంగా గాయపడిన ముగ్గుర్రి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఆపరేషన్ చేసి బుల్లెట్లు బయటకు తీసినప్పటికీ జమీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించారు. వారం రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన అతడు.. ఇవాళ ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.