యాప్నగరం

సమత కేసులో సంచలన తీర్పు నేడే.. సర్వత్రా ఉత్కంఠ

Adilabad: సమత కేసులో నిందితులుగా ఉన్నవారిని పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చారు. సమత కుటుంబీకులతో పాటు, గ్రామస్థులు పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకున్నారు.

Samayam Telugu 30 Jan 2020, 11:17 am
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో తీర్పు ఈ రోజు వెలువడనుంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్‌ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి గురువారం తుది తీర్పు వెలువరించనున్నారు. తీర్పు నేపథ్యంలో ప్రత్యేక న్యాయస్థానం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమత కేసులో నిందితులుగా ఉన్నవారిని పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చారు. సమత కుటుంబీకులతో పాటు, గ్రామస్థులు పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకున్నారు.
Samayam Telugu samatha case


Also Read: మహిళలూ వేధింపులా? షీటీమ్స్ నుంచి కొత్త నెంబర్‌, ఎలా వాడాలంటే..

కుమ్రం భీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో నవంబర్‌ 24న ముగ్గురు నిందితులు షేక్‌ బాబా, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లు సమతను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసు విచారణకు డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు, పోలీసు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారణ జరిపింది. డిసెంబర్ 31న కోర్టు విచారణ పూర్తి చేసింది. ఈ నెల 20తో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగిశాయి.

Also Read: అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. నిజాలివీ.. కరోనా వైరస్‌పై మంత్రి ఈటల

Also Read: లంచం ఇవ్వలేదని చెప్పులతో బాదుతూ.. మహిళా అధికారిణి హల్‌చల్!

నిజానికి ఈ కేసులో తీర్పు ఈ నెల 27న వెల్లడి కావాల్సి ఉన్నా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తీర్పును జనవరి 30కి వాయిదా వేశారు. న్యాయమూర్తి వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read: శుభవార్త.. రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్స ఉచితం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.