యాప్నగరం

139 మంది రేప్ కేసు బాధితురాలితో ఇంటర్వ్యూ.. తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

Telangana DGP: క్యూ న్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. ఈయన కొద్ది రోజుల క్రితం అత్యాచార బాధితురాలితో ఓ ఇంటర్వ్యూ చేశారు.

Samayam Telugu 17 Sep 2020, 5:46 pm
క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహకుడైన తీన్మార్ మల్లన్నపై ఓ న్యాయవాది డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతిని మల్లన్న ఇంటర్వ్యూ చేయడాన్ని న్యాయవాది అరుణ కుమారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
Samayam Telugu తీన్మార్ మల్లన్న
teenamar mallanna


క్యూ న్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. ఈయన కొద్ది రోజుల క్రితం అత్యాచార బాధితురాలితో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నవీన్ అన్ని రకాల హద్దులు దాటారని న్యాయవాది ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. సైకో మాదిరిగా ఇంటర్వ్యూ చేశారని ఆరోపించారు. అత్యాచారం చేసిన 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లను రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్‌కు చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అంతేకాక, గత ఏడాది జరిగిన దిశ ఎన్ కౌంటర్ కూడా బూటకమని ఆయన చేసిన వ్యాఖ్యానించినట్లు అరుణకుమారి పేర్కొన్నారు.

Also Read: పురానాపూల్ వద్ద మూసీ ఒడ్డున మొసలి కలకలం

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.