యాప్నగరం

బీజేపీలోకి ఫైర్‌బ్రాండ్... బండి సంజయ్‌తో అడ్వకేట్ రచనారెడ్డి భేటీ

తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి బీజేపీలో చేరనున్నారు. మంగళవారం బండి సంజయ్‌తో భేటీ అయిన ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 6 Jul 2022, 8:10 am
తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి బీజేపీలో చేరనున్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌తో ఆమె భేటీ అయ్యారు. పార్టీలో చేరాల్సింది సంజయ్ ఆమెను ఆహ్వానించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన రచనా రెడ్డి.. బీజేపీలో చేరికపై సంజయ్‌తో చర్చలు జరిపానని.. త్వరలోనే బీజేపీలో చేరతానని వెల్లడించారు. అయితే పార్టీలో ఎప్పుడు చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని.. త్వరలోనే తేదీ ప్రకటిస్తానని తెలిపారు.
Samayam Telugu Advocate Rachana Reddy


తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా సుపరిచితురాలైన రచనా రెడ్డి గతంలో తెలంగాణ జనసమితిలో చేరారు. అయితే కొద్దిరోజులకే పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో విభేదాలు రావడంతో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. అప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీలోనూ చేరని ఆమె తాజాగా బీజేపీ వైపు మొగ్గు చూపడం ఆసక్తి రేపుతోంది. రచనా రెడ్డి న్యాయవాదిగా తనదైన ముద్ర వేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు రైతుల తరపున హైకోర్టులో కేసులు వేసి వాదించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రచనా రెడ్డి వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించడం విశేషం.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.